Friday, September 27, 2024

ADB: తెలంగాణ ఉద్యమంలో కొండ బాపూజీ లక్ష్మణ్ ది కీలక పాత్ర…

నిర్మల్ ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రభ న్యూస్) : స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న బాపూజీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నిర్మల్ జిల్లా పద్మశాలి సంఘ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వరప్ప ప‌లువురు నాయకులతో కలిసి బాపూజీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సంఘ సభ్యులు, నాయకులు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement