Wednesday, October 9, 2024

ADB: రూ.54వేల అక్రమ టేకు కలప పట్టివేత.. ఒకరిపై కేసు

జన్నారం, అక్టోబర్ 9 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని అల్లీనగర్ గ్రామానికి చెందిన ఆత్రం నగేష్ ఇంట్లో రూ.54వేల అక్రమ టేకు కలపను బుధవారం తమ సిబ్బంది పట్టుకున్నట్లు తాళ్లపేట రేంజ్ ఆఫీసర్, జన్నారం ఇంచార్జి వి.సుష్మారావు తెలిపారు.

ముందస్తు సమాచారం మేరకు తమ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, సెక్షన్, బీట్ ఆఫీసర్లు శివకుమార్, సి.హెచ్ కిరణ్మయి, మధుకర్, జె.లాల్బాయి, భోజనాయక్, రంగు పరమేశ్వర్, తన్వీర్ పాష, బేస్ క్యాంప్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ కలపను పట్టుకొని సీజ్ చేశామన్నారు. ఆ నగేష్ పై ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కోర్టు కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. పట్టుకున్న ఆ కలపను స్థానిక కలప డిపోకు తరలించినట్లు ఆమె తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement