Tuesday, July 2, 2024

ADB: కేంద్ర మంత్రులను కలిసిన మాజీ ఎంపీ సోయం..

ఆంధ్రప్రభ, బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఇంతకాలం పార్టీ సంస్థాగత కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు ఎట్టకేలకు పార్టీకి చేరువయ్యారు. గురువారం ఢిల్లీ వెళ్లిన సోయం బాపూరావు ముందుగా తనతో కలిసి క్రితంసారి ఎంపిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను తన నివాస గృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పోరాట పటిమతో పని చేయాలని తన వంతు సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తనకు భరోసా ఇచ్చినట్టు సోయం తెలిపారు.


కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసిన సోయం..
కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఊయికే దుర్గా దాస్ ను మాజీ ఎంపీ సోయం బాపురావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసీ ఉద్యమ నేతగా దుర్గా దాస్ తో తనకు అనుబంధం ఉందని, గతంలో ఆయనతో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ఆదివాసుల హక్కులు ప్రధాన సమస్యలను వివరించగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించేందుకు కూడా వస్తానని మంత్రి పేర్కొన్నట్టు సోయంబాపు వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement