Monday, July 1, 2024

TS: మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కు తీవ్ర అస్వస్థత..

ఉట్నూర్, జూన్ 29 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు రాథోడ్ రమేష్ శనివారం తీవ్ర అస్వ‌స్థ‌తకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయ‌న‌ను ఆదిలాబాద్ గజానంద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రాథోడ్ రమేష్ కు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వైద్యాధికారుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ విషయం తెలియగానే బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆస్ప‌త్రికి వెళ్లి పరామర్శించారు. రాథోడ్ రమేష్ త్వరగా కోలుకోవాలన్నారు. ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రముఖులు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement