Friday, September 20, 2024

ADB | న‌కిలి విలేఖ‌రికి 14 రోజుల రిమాండ్..

జన్నారం, (ప్రభన్యూస్): ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ను డ‌బ్బులు డిమాండ్ చేసిన‌ నకిలీ స్టాఫ్ రిపోర్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాతంత్ర దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్ట‌ర్ ని అంటూ… మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని జయరాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీరాముల మధుసూదన్ కు ఈనెల 11న ఫోన్ చేసిన రత్నం తిరుపతి రూ.5వేల డబ్బులు డిమాండ్ చేశాడు.

కాగా, మధుసూదన్ ఫిర్యాదు మేరకు జన్నారం ఎస్సై గుండేటి రాజవర్ధన్… నకిలి విలేకరి రత్నం తిరుపతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అత‌డిని లక్షేటిపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించి అక్కడి సబ్ జైలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement