Saturday, September 7, 2024

ADB: అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు.. సీపీ శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జులై 20(ప్రభ న్యూస్) : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ కోరారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నందున రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రత, ప్రాణ రక్షణను దృష్టిలో పెట్టుకొని డ్యామ్స్, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, సాధారణ పరిస్థితి వచ్చే వరకు అక్కడికి ప్రజలెవ‌రూ వెళ్లకూడదని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement