Thursday, September 19, 2024

ADB: రేపు చెన్నూరుకు ఉప ముఖ్యమంత్రి… ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపాయి. చెన్నూరు మండలం శివలింగాపూర్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్పిన 11 మెఘావాట్ల సోలార్ ప్లాంటును భట్టి విక్రమార్క ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్….
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగాపూర్ లో శనివారం సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, పెద్దపెల్లి, మంచిర్యాల డీసీపీలు చేతన్ భాస్కర్ లతో కలిసి సభాస్థల, బందోబస్తు నిర్వహణ తదితర ప్రాంతాలను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement