Saturday, September 14, 2024

ADB: భారీ వ‌ర్షాలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు… కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, జులై 20(ప్రభ న్యూస్) : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజల సహాయం కోసం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వర్షాలు నిరంతరంగా కురుస్తుండడంతో పాటు రాబోవు 2 రోజులు వర్ష సూచన ఉన్నందున వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజా రక్షణ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఆందోళన పడవద్దని తెలిపారు. ఈ క్రమంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, వరద పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు సహాయం కోసం కంట్రోల్ రూమ్ నం.08736-250501, 08736-250502 లలో సంప్రదించవచ్చని, తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement