Monday, July 8, 2024

ADB: జెడ్పీలకు ఇక కలెక్టర్లే బాసులు.. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజార్షి షా…

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : జిల్లా పరిషత్ ల ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో జెడ్పీ చైర్మన్ స్థానంలో కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఆయా కలెక్టర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ పదవీకాలం ముగిసిన సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గౌరవంగా ఆత్మీయ సన్మానంతో వీడ్కోలు పలికారు.

జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ అధికారులు పాల్గొని ఘనంగా చైర్మన్ ను సన్మానించారు. ఐదేళ్లలో నిష్పక్షపాతంగా అభివృద్ధికి జనార్ధన్ రాథోడ్ సేవలందించారని పలువురు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు గోక గణేష్ రెడ్డి, మల్లెపూల నరసయ్య, తుమ్మ మంజులారెడ్డి, బీజేపీ జెడ్పీటీసీ తాళ్ల పెళ్లి రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా చార్జి తీసుకున్న కలెక్టర్ రాజార్శి షా కు అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement