Friday, September 20, 2024

TG: ఆదిలాబాద్ లో స్వచ్ఛదనం.. పచ్చదనం..

కలెక్టర్ కు సాదరంగా స్వాగతం పలికిన కమాండెంట్ నితిక పంత్
ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్ : ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం..పచ్చదనం కార్యక్రమం గురువారం యాపలగూడ పోలీస్ బెటాలియన్ క్యాంపులో ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఎస్పీ గౌస్ అలం (ఐపీఎస్) ఆదిలాబాద్ డిఎఫ్ఓ, ప్రశాంత్ బాజీరావు పాటిల్ (ఐఎఫ్ఎస్) అక్కడి సిబ్బంది, విద్యార్థులు ముమ్మరంగా మొక్కలు నాటారు. అయితే తొలిసారి వచ్చిన కలెక్టర్ రాజార్షి షా కు ఇటీవలే కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సతీమణి రితిక పంత్ (ఐఎఫ్ఎస్) పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతం పలికారు.

బెటాలియన్ పోలీసులు మర్యాదపూర్వకంగా గౌరవ వందనం చేసి స్వాగతించారు. జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆయన సతీమణి నితికాపంత్ తో బెటాలియన్ వివరాల గురించి పచ్చదనం కార్యక్రమాల గురించి ఆరా తీయడం గమనార్హం. కలెక్టర్ వెంట ఎస్పీ గౌస్, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ కూడా పోలీస్ కమాండ్ బెటాలియన్ లో మొక్కలు నాటారు. విద్యార్థులకు కలెక్టర్ దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. బంగారుగూడ పాఠశాల చిన్నారులు ఉపాధ్యాయులు పచ్చదనం స్వచ్ఛతను కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement