Thursday, October 17, 2024

ADB: చైన్ స్నాచింగ్ దొంగ అరెస్టు.. 2తులాల పుస్తెలు రికవరీ..

జన్నారం, అక్టోబర్ 10 (ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా దంతనపల్లికి చెందిన చింతకింది లావణ్య మెడలోని రెండు తులాల బంగారపు పుస్తెలతాడు దొంగలించిన చైన్స్ స్నాచర్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడకు చెందిన బోర్లకుంట రాజేందర్ ను గురువారం అరెస్ట్ చేసి లక్షేటిపేట కోర్టులో హాజరు పర్చినట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు. ఆ దొంగ నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడును, పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకునట్లు ఆయన చెప్పారు.

దంతనపల్లికి చెందిన లావణ్య భర్తతో కలిసి ఈనెల 3న మండలంలోని దేవునిగూడలో జరిగిన ఓ 21ఫస్ట్ ఫంక్షన్ కు వచ్చి వెళుతుండగా, ఆ దొంగ పల్సర్ వాహనంపై వచ్చి ఆమె మెడలోని 2 తులాల బంగారపు పుస్తెలతాడును దొంగలించాడన్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తమ హెడ్ కానిస్టేబుల్ భూక్య తుకారాం, కానిస్టేబుల్ కొత్తూరి భాస్కర్, సురేష్ చాకచక్యంగా నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎస్.ఐని, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, లక్షేటిపేట సి.ఐ అల్లం నరేందర్ అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement