Thursday, September 19, 2024

ADB | టేకు చేట్ల‌ను నరికిన 8 మందిపై కేసు నమోదు…

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా కవ్వాల జన్నారం అటవీ డివిజన్ ఇందనపల్లి పరిధిలోని లోతోర్రే బీటులో మూడు విలువైన టేకు చేట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం మేరకు 8 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఇందనపల్లి రేంజ్ అధికారి హఫీజుద్దీన్ గురువారం తెలిపారు.

నాయకపు గూడకు చెందిన కొమర గట్టయ్య, ముచినేని బాపురావు, కొమెర రాజన్న, గట్టయ్య, మహేష్, కిట్టు, మేకా నరేష్ లు టేకు చేట్ల‌ను నరికి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని… ఆ చెట్ల‌ విలువ దాదాపు రూ.38వేలు ఉంటుందని ఆయన తెలిపారు.త్వరలోనే వారిని రిమాండ్ కు తరలించనున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement