Friday, October 4, 2024

ADB: చెన్నూరు లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా, అరెస్ట్..

చెన్నూర్, ప్రభ న్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మత్తడి పేలుళ్ళ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులకు వెసులుబాటు కల్పిస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులనే బాధ్యులను చేస్తూ జైలుకు పంపడాన్ని నిరసిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ చౌక్ లో ధర్నా చేపట్టారు.

ధర్నా చేస్తున్న నాయకులను అరెస్టు చేసే క్రమంలో నాయకులకు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగి కౌన్సిలర్ దోమకొండ అనిల్ స్పృహ కోల్పోయాడు. ఆందోళన చేస్తున్న నాయకులను సిఐ రవీందర్ సిబ్బందితో స్టేషన్ కు తరలించారు. పోలీసు అధికారులు బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకున్ని అరెస్టు చేసి వెంటనే విడుదల చేసి, తమ నాయకులను అరెస్టు చేసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement