Wednesday, September 18, 2024

ADB | చెట్లు నరికిన ఐదుగురి బైండోవర్..

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని మహ్మదాబాద్ అటవీ బీట్ లో అక్రమంగా చెట్లను నరికిన ఐదుగురిని అరెస్ట్ చేసి… జన్నారం తాహసిల్దార్ రాజమనోహర్ రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుష్మారావు గురువారం సాయంత్రం తెలిపారు.

మండలంలోని మల్యాలకు చెందిన దొసండ్ల సత్యం,చిన్నయ్య, ముడితె బీమయ్య, ఆరె.సత్యనారాయణ,ఆరె ప్రశాంత్లను ఆరెస్ట్ చేసి తాహసిల్దార్ ముందు హాజరు పర్చామన్నారు. అనంతరం తాహసిల్దార్ ఆ నిందితులతో అగ్రిమెంటు రాయించుకొని సొంత పూచికత్తుపై వదిలివేసారని ఆమె చెప్పారు.

ఆ నిందితులపై గత నెలలో టేక్ చెట్లను నరికి వేసిన కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. ఆ నిందితులను మహ్మదాబాద్ ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు యాదమ్మ, బి.శ్రవణ్ కుమార్ అరెస్ట్ చేసి బైండోవర్ చేసినట్లు ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement