Friday, October 4, 2024

ADB: అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. బాబు జగ్జీవన్.. ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పరితపించిన మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జగ్జీవన్ రామ్ చౌక్ లో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ… బాబు జగ్జీవన్ రామ్ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాటాలు చేసిన మహనీయుడని కొనియాడారు. పేదరికం నిరక్షరాస్యత అధికంగా ఉన్న దళిత వర్గాల్లో చైతన్యం నింపి వారి హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు.

- Advertisement -

సుమారు యాభై సంవత్సరాలు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని, పాలకులు, దళితుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మహనీయుల జయంతి, వర్ధంతులను జరుపుకోవడం కాకుండా వారి ఆశయాలను నెరవేర్చినప్పుడే సార్థకత ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిని ఈడీ సునీత, దళిత సంఘాల నాయకులు మల్లెలస్వామి, నక్క రాందాస్, రాజన్న, నాగన్న, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement