బెల్లంపల్లి : బుచ్చయ్యపల్లి గ్రామంలో క్షేత్రప్రదర్శనలో భాగంగా వ్యవసాయ క్షేత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏఓ ప్రేమ్కుమార్ మాట్లాడుతూ ఆకెనపల్లి గ్రామంలో సుమారు 60 ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుందని, ఇక్కడి నేలలు పల్లి సాగుకు అనుకూలంగా ఉంటాయని, రైతులు వచ్చే యేడాది నుండిఇంకా అధికసంఖ్యలో పల్లి సాగుకు వైపు మొగ్గు చూపాలని సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement