Sunday, September 8, 2024

Adilabad – తెగిన తర్ణం వారధి

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ – చంద్రాపూర్ (మహరాష్ట్ర) ను కలిపే జాతీయ రహదారి కి నాలుగు రోజులుగా వాహ‌న‌ రాకపోకలు స్తంభించిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్ణం వద్ద తాత్కాలిక వంతెన వాగు వరద ప్రవాహానికి నాలుగు రోజుల కిందటే కొట్టుకుపోయింది. దీంతో జిల్లా కేంద్రానికి జైనథ్ బేల మండలాలతో పాటు సరిహద్దు చంద్రపూర్ మహారాష్ట్రకు వాహ‌నాల‌ రాకపోకలు నిలిచిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. తర్ణం వద్ద జాతీయ రహదారిపై భారీ వంతెన ఎనిమిది నెలల కిందటే కృంగిపోవడంతో ప్రత్యామ్నాయంగా .. తాత్కాలిక అప్రోచ్ వంతెన ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల‌ కురిసిన వ‌ర్షాల‌కు వ‌ర‌ద తాకిడికి తాత్కాలిక ఆప్రోచ్ వంతెన కొట్టుకుపోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement