Monday, September 16, 2024

ADB: ఘన్పూర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

ఉట్నూర్, ఆగస్టు 3 (ప్రభన్యూస్): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీని గురువారం ఆదిలాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ కుశుబు గుప్తా సందర్శించారు. అడిషనల్ కలెక్టర్ మొదటిసారిగా రావడంతో ఆమెకు సర్పంచ్ పంద్రాలత, ఎంపీపీ జయవంతరావు, అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గ్రామపంచాయతీ రికార్డులు పరిశీలించి పంచాయతీలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.

నర్సరీ క్రిమిటోరియం పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ పంద్రాలత, అధికారులతో పలు విషయాలపై అడిషనల్ కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయవంత్ రావు, డిఎల్పిఓ బిక్షపతి గౌడ్, ఎంపీడీవో తిరుమల ఎంపీఓ కన్నాజి మహేష్ కుమార్, ఈజిఎస్ ఏపీవో రజినీకాంత్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement