Thursday, October 24, 2024

ADB |ఏడుగురి నాటుసారా విక్రేతలపై బైండోవర్ కేసు నమోదు

జన్నారం, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ): నాటు సారాను తయారుచేసి విక్రయించిన మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఏడుగురిని గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ నర్సిమ్ములు తెలిపారు.

జన్నారం మండలంలోని చింతగూడ, కిష్టాపూర్, కలమడుగు, చింతలపల్లి, మహమ్మదాబాద్, తిమ్మాపూర్, రేండ్లగూడ గ్రామాలకు చెందిన బాదావత్ లక్ష్మి, పుట్ట కొక్కుల నరేష్, ఎల్.సంతోష్ నాయక్, గొల్లె అమృత, డోంగరి విజయలక్ష్మి, గందం లక్ష్మిలు నాటు సారా తయారు చేసి అమ్ముతున్నారనే అభియోగం మేరకు కేసులు నమోదు చేసి, సత్ప్రవర్తన కోసం రూ.లక్ష, ఏడాది జైలు శిక్ష అమలు కోసం స్థానిక డిప్యూటీ తహసిల్దార్ రామ్మోహన్ ఎదుట బైండోవర్ చేశామన్నారు.

వారందరిచే బాండ్ పేపర్ పై అగ్రిమెంట్ రాయించుకొని ఆ డిప్యూటీ తహసీల్దార్ సొంత పూచికపై వదిలినట్లు అయన చెప్పారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… ఇకముందు నాటుసారా తయారు చేసి అమ్మినట్లయితే పీడీ కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement