Saturday, June 29, 2024

Adilabad – ఉత్తమ సేవలకు విశిష్ట పురస్కారం..20 మంది పోలీస్ అధికారులకు సేవా పతకాలు

.ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : పోలీస్ శాఖలో క్రమశిక్షణ అంకితభావంతో ఉత్తమ సేవలందించిన 20 మంది పోలీస్ అధికారులకు రాష్ట్ర పోలీస్ శాఖ సేవా పతకాల కింద పురస్కారాలను అందజేయనుంది. విధినిర్వహణలో విశిష్ట సేవలు అందించిన 20 మంది పోలీసు అధికారుల జాబితాను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ అలం ప్రకటించి వారిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలోఉత్తమ సేవలందించిన వారికి ప్రతి ఏటా సేవా పతకాలను ప్రధానం చేస్తుంది.

ఈ జాబితాలో ఒకరు ఉత్తమ సేవా పథకాన్ని అందుకోనుండగా 19 మంది సేవా పతకాల కింద ఎంపిక కావడం గమనార్హం.

*పురస్కారాలకు ఎంపికైన వారు వీరే..*

ఉత్తమ సేవా పథకం కింద ఆదిలాబాద్ ఏఆర్ ఎస్ ఐ పి .యువరాజ్ ఎంపిక కాగా, సేవా పతకం కింద ఎంపికైన వారిలో 19 మంది ఉన్నారు. వీరిలోజి.వి. రమణ రెడ్డి, బోత్ ఎస్ ఐ, బి. శివరామ్ తాంసి ఎస్ఐ,ఎన్ .ముకుంద్ రావు, ఉట్నూర్ ఏఎస్ఐ, కె రమేష్ నేరడిగొండ ఏఎస్ఐ, కె భీంరావు ఇందర్వెల్లి ఏఎస్ఐ, ఆర్. ఆత్మారాo, ఉమెన్ ఎస్సై ఆదిలాబాద్,ఆర్. బలీరామ్,గుడిహత్నూర్. ఆర్ .గణపతి భీంపూర్ ఏఎస్ఐ, వెంకటమ్మ, I-టౌన్ మహిళా ఏ ఎస్ ఐ ,ఎం జయలక్ష్మి II-టౌన్ మహిళా విభాగం ఏఎస్ఐ ఎన్ పోశెట్టి, ఆదిలాబాద్ ఏ ఆర్, బి సురేష్,ఎస్ లక్ష్మణ్ ఏ ఎస్ ఐ లు, కె గణపతి, తాప్సి హెడ్ కానిస్టేబుల్, కె వెంకట్ రావు, జైనథ్ హెడ్ కానిస్టేబుల్ రాజన్న, ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆదిలాబాద్ ఎండి జాఫర్ ఉద్దీన్ జఫర్ ఉద్దీన్ ఆదిలాబాద్ ఏఆర్,షేక్ అమీర్, ఆదిలాబాద్ ఏ ఆర్. జె దేవిదాస్ ఇందర్వెల్లి పిసి,బి సురేష్ ఎ ఆర్ ఎస్ ఐ ఆదిలాబాద్ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు అవార్డుల పంట తీసుకొచ్చిన 20 మందిని ఆదివారం ఎస్పీ అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement