Tuesday, October 15, 2024

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్…

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి): జిల్లా అదనపు కలెక్టర్ గా (స్ధానిక సంస్థలు) ప్రతిమా సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొంగరకలాన్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు.


ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా కొనసాగిన ప్రతీక్ జైన్ ను భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో మెదక్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా కొనసాగిన ప్రతిమాసింగ్ ను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement