Thursday, September 19, 2024

ADB | ఎలక్ట్రికల్ షాప్ యజమాని ఇంట్లో చోరీ…

  • 4 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు అపహరణ

జన్నారం,(ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎలక్ట్రికల్ అండ్ హార్డ్ వేర్ షాపు యజమాని రాజు పురోహిత్ రామ్ సింగ్ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 8.20 గంటలకు ఇంటికి తాళం వేసి మంచర్యాలకు వెళ్లాడు రాజు. తిరిగి వచ్చి చూసే సరికి తలుపుల తాళాలు పగులగొట్టి ఉండడం గమనించారు. దీంతో ఇంట్లోకి చొరబడిన దొంగలు 4 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు రాజు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు.

యజమాని రామ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని ఎస్సై రాజ‌వ‌ర్ధ‌న్ తెలిపారు. ఇంటి ఆవరణ, చోరీ జరిగిన ప్రదేశాన్ని క్లూస్‌ టీమ్‌తో పరిశీలించామని తెలిపారు. లక్సెట్టిపేట సీఐ అల్లం నరేందర్ సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించి దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement