Friday, October 18, 2024

ADB: మాజీ ఎంపీపీ భర్త పై దాడి..


మంచిర్యాల, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాజీ ఎంపీపీ భర్త శ్రీనివాస్ పై దాడి చేసిన సంఘటన నెలకొంది. అదే మండలం నర్సింగాపూర్ గ్రామం నుండి రాపల్లి వైపు ప్రయాణిస్తున్న ఎంపీపీ భర్త శ్రీనివాస్ కారు వెనకాల వస్తున్న మోటార్ సైకిల్ కు కారు డోరు తగిలి కింద పడగా రాపల్లి గ్రామానికి చెందిన యువకులు వారి కుటుంబీకులకు ఫోన్ చేయగా అక్కడికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మాజీ ఎంపీపీ భర్త పై దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడ్డ మందపల్లి శ్రీనివాస్ ను అటుగా వచ్చిన స్థానికులు మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు మందపల్లి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుంటామని చెప్పడంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. మందపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం హాజీపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement