Friday, September 6, 2024

Accident – రాంగ్ రూట్ లో ప్రయాణం – ఇద్దరు యువకులు దుర్మరణం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్: చందానగర్‌లో ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చందానగర్‌ టీజీఎస్‌ఆర్టీసీ ఓ బైకును బుధవారం ఉదయం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు.

కాగా, మృతులను చందానగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే, మదీనాగుడ జీఎస్ఎం మాల్ నుంచి చందానగర్‌కు బైక్‌పై మనోజ్, రాజులు వెళుతున్నారు. చందానగర్‌ జీఎస్ఎం మాల్ సమీపంలో యుటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళుతూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టారు.

బైక్‌ నడుపుతున్న మనోజ్‌తో పాటు వెనకాల కూర్చున్న రాజు కూడా అక్కడిక్కడే చనిపోయాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement