Thursday, October 17, 2024

Accident :ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, జ‌గిత్యాల : ఆర్టీసీ బస్సు ఢీ కొని హోంగార్డు మృతి చెందిన సంగ‌ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లిలో గురువారం జ‌రిగింది. మెట్‌పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సుబ్బరాజు ఓ హోటల్‌లో టిఫిన్‌ తీసుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుబ్బరాజు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement