Tuesday, September 17, 2024

Accident – కారు బోల్తా – ఒకరి మృతి

నవీపేట్ ప్రభ న్యూస్ నవీపేట మండలంలోని అబ్బాపూర్ (ఎం) వద్ద బాసర రోడ్డుపై కారు గత రాత్రి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా బైంసా మదీనా కాలోనికి చెందిన సల్మాన్ 25 సంవత్సరాలు గుర్తించడం జరిగిందని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

వివరాల ప్రకారం.నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నుంచి బోధ న్ లో హజ్రత్ సయ్యద్ జలాల్ బుఖారి జరగ వద్ద జరుగుతున్న ఉర్సుకు సవేరా కారులో పలువురు బయల్దేరారు. మార్గమధ్యంలోఅబ్బాపూర్ (ఎం) పెట్రోల్ పంప్ వద్ద వాహనము అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సల్మాన్ (25) అక్కడికక్కడే మృతిచెందాడు.

కారులో ఉన్న మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement