Tuesday, October 22, 2024

TG: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి..

శంషాబాద్, ఆగస్టు 6(ప్రభ న్యూస్) : ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తోట్ల అంజయ్య (40) ను కారు ఢీకొట్టడంతో అద్దంలో ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో కారు వెనకాల సీట్ లో మృతుడి తల తెగిపడింది. మృతుడు శంషాబాద్ గ్రామానికి చెందిన అంజయ్యగా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement