Friday, September 20, 2024

Accident – లారీ – కారు ఢీ – ఇద్దరి దుర్మరణం

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

- Advertisement -

ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం చిట్లి గ్రామానికి చెందిన వంశీ (19), నిజామాబాద్ కుమార్ దల్లి ప్రాంతానికి చెందిన రాజేష్ (20) అనే ఇద్దరు యువకులు.. తమ స్నేహితుడైన రాజేష్ అనే మరో యువకుడితో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ వద్ద గల ఓ రైస్ మిల్ దగ్గర ప్రమాదం జరిగింది.

.ఈ ప్రమాదంలో వంశీ, రాజేష్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement