Thursday, October 17, 2024

Accident: కారు ద‌గ్ధం…ప్ర‌యాణికులు సుర‌క్షితం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, నారాయ‌ణ‌పేట : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం రోడ్డు క్యాంపు సమీపంలో గురువారం తెల్ల‌వారు జామున‌ నాలుగు గంటలకు కారు ద‌గ్ధ‌మైంది. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట నుంచి మంత్రాలయానికి వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ నుంచి ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసి ప‌డ్డాయి. ఇంత‌లోనే కారు డోర్లు ఓపెన కావ‌డంతో అందులో ప్ర‌యాణం చేస్తున్న‌వారు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో నలుగురు చిన్నారులు, ముగ్గురు పెద్దవారు ఉన్నట్టు తెలిసింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement