Friday, September 20, 2024

MBNR: కోయిలకొండ బీసీ హాస్టల్లో ఏసీబీ దాడులు..

కోయిలకొండ, ప్రభ న్యూస్ 13 : మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. వార్డెన్ రాధాకృష్ణ అందుబాటులో లేకపోవడం విశేషం. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ… బీసీ బాలుర వసతి గృహాన్ని ఉదయం తనిఖీ చేయగా.. వార్డెన్ రాధాకృష్ణ అందుబాటులో లేకపోవడం.. విద్యార్థులకు ఇప్పటివరకు సంబంధిత యూనిఫామ్ విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్ ఖర్చులు ఇవ్వలేకపోవడం జరిగిందన్నారు.

విద్యార్థులకు భోజన పరిస్థితులు గోరంగా ఉన్నాయన్నారు. బియ్యం సంచిని ఇప్పి చూడగా… ఇందులో పురుగులు ఉండడం కనిపించాయని ఆయన తెలిపారు. ఇంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదన్నారు. విద్యార్థుల బాత్రూములు అధ్వాన్నంగా ఉన్నాయని వారు తెలిపారు. హాస్టల్ ను తనిఖీ చేసిన రిపోర్టును పై అధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు జలానీ, లింగస్వామి, అశోక్ రావు, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement