Thursday, September 12, 2024

TG: ఏసీబీకి చిక్కిన డిప్యూటీ రిజిస్ట్రార్..

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కో – ఆపరేటివ్ శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బొమ్మల శ్రీనివాసరాజు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.. ఏసీబీ సిటీ జోన్ -2 డీఎస్పీ శ్రీధర్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కో – ఆపరేటివ్ కార్యాలయంలో ఇవాళ జ‌రిగిన రైడ్ లో శ్రీనివాస రాజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

డీఎస్పీ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం… ఈనెల 24న తమకు ఫిర్యాదు అందిందని, దాని ప్రకారం నవ భారత్ కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కు ఒక కుటుంబానికి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించటానికి ఆర్బిట్రైటర్ గా వెళ్లిన జిల్లా కో – పరేటివ్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదుదారు నుంచి రూ.5లక్షలు లంచం డిమాండ్ చేశాడన్నారు.

అందులో భాగంగా గురువారం లక్ష రూపాయలు కలెక్టరేట్ వద్ద కారు డిక్కీ తెరిపించి మధ్యవర్తుల సహాయంతో లక్ష రూపాయలు పెట్టీ లాక్ చేస్తుండగా వల పన్ని పట్టుకున్నామన్నారు. లక్ష రూపాయలు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందుతుడిని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement