Thursday, September 19, 2024

Hyderabad : కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం..

కెనడాలో హైదరాబాద్ లోని మీర్‌పేట్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. ప్రణీత్ అనే యువకుడు కెనడాలో ఎం.ఎస్ చేయడం కోసం వెళ్లాడు. అయితే.. అక్కడ చెరువులో ఈతకు వెళ్లి చనిపోయాడు. కాగా.. మీర్‌పేట్ కి చెందిన రవి, సునీతకి ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులు కెనడాలోనే చదువుకుంటున్నారు.

ఉన్నత చదువుల కోసం 2019లో అక్కడికి వెళ్లారు. చిన్న కుమారుడు ప్రణీత్ పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటో లోని లేక్ క్లియర్‌కి ఔటింగ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో.. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పుట్టిన రోజే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియాకి చేరడానికి ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement