Friday, October 18, 2024

WGL: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

గీసుగొండ, అక్టోబర్ 11 (ప్రభ న్యూస్) : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని డీసీఎం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గీసుగొండ ఎస్ఐ కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపల్లి అఖిల్ 24 తన ద్విచక్ర వాహనంపై పనిమీద వరంగల్ కు వెళ్ళే క్రమంలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలలోని 16 వ డివిజన్ గొర్రెకుంట వద్ద అతని వాహనాన్ని డీసీఎం ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది.

దీంతో బైక్ పై వెళ్తున్న అఖిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఎ.మహేందర్ తెలిపారు. యువకుడు మృతి చెందడంతో ఉప్పరపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement