Friday, October 18, 2024

ADB: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

కాసిపేట, జులై 25 (ప్రభ న్యూస్) : మంచిర్యాల్ జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన పెంజర్ల లక్ష్మన్ (35) యువకుడు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన స్కూటీపై సోమగూడెం నుండి ఇంటికి వస్తున్న క్రమంలో సోమగూడెం సుద్దాలవాగు సమీపంలో స్కూటీ అదుపుతప్పి రోడ్ పై పడిపోవడంతో తలకు బలంగా బండరాయి తగలడంతో తీవ్ర గాయాల‌తో అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement