Thursday, September 19, 2024

ADB: పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య…

ఉట్నూర్, ఆగస్టు 31 (ప్రభ న్యూస్) : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో విద్యార్ధిని లింగవాడ్ రక్షిత (15) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత వసతి గృహం బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన లింగవాడ్ రక్షిత ఐదు రోజుల క్రితమే కళాశాల వసతి గృహంలో చేరింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement