Thursday, September 12, 2024

NZB: చిన్నారిని ఢీకొట్టిన స్కూల్ బస్సు..

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 31(ప్రభ న్యూస్) : 5సంవత్సరాల చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ మేరీ పాఠశాలలో పీపీ -2 చదువుతున్న అపర్ణ అనే చిన్నారిని ప్రతిరోజు లాగే చిన్నారి తండ్రి పాఠశాలకు శనివారం ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు.

ఈ క్రమంలో సుభాష్ నగర్ చౌరస్తాలో విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ కు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుతో డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యు లు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో చిన్నారి చేయి విరిగిపోయింది. ప్రస్తుతం చిన్నారి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఏ విధంగా స్పందించి చిన్నారి కుటుంబానికి న్యాయం చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement