Sunday, September 8, 2024

Nizamabad | జిజిహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స.. వైద్యులకు సన్మానం!

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిలో నాన్ డీసెంట్ ఒజినల్ ఇస్ట్రెక్టమి” అనే క్లిష్టమైన గర్భా శయ సంబంధిత సమస్యపై ఇర్ఫాన్ బేగం అబ్దుల్లా అనే మహిళకు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయ వంతం చేశారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన 60 సంవత్సరాల వయసు గల ఇర్ఫాన్ బేగం అబ్దుల్లా అనే మహిళకు 9 రోజుల క్రితం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబా దులో “నాన్ డీసెంట్ ఒజినల్ ఇస్ట్రె క్టమి” అనే క్లిష్టమైన గర్భాశయ సంబంధిత శస్త్ర చికిత్స చేశారు.

కడుపుపై ఎటువంటి కోత లేకుండా ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సోమవారం ఇర్ఫాన్ బేగం సంపూర్ణంగా కోలుకొని కృతజ్ఞత భావంతో డాక్టర్ ప్రతిమ రాజ్ సూప రింటెండెంట్, డాక్టర్ అపర్ణ గైనకాలజీ వైద్యులు,ఇతర వైద్య సిబ్బందిని పూలమా లలతో సత్కరించి తమ అభి మానాన్ని చాటుకున్నారు..
ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మ కం పెరుగుతుందని, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటే మరింత ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement