Wednesday, September 18, 2024

TG: ప్రాణం తీసిన ఫోన్ కాల్…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం : ఫోన్ లో మాట్లాడుతూ.. వాటర్ హీటర్ రాడ్ ను పొర‌పాటున‌ త‌న చంక‌లో పెట్టుకోవ‌డంతో విద్యుదాఘాతానికి గురై ఓ వ్య‌క్తి మృతిచెందిన సంఘ‌ట‌న ఖ‌మ్మంలో ఆదివారం రాత్రి జ‌రిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంలోని స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) త‌న ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం కోసం వేడినీళ్ల పెట్టాడు.

వాటర్ హీటర్ రాడ్ ప‌ట్టుకుని స్విచ్ఛ్ ఆన్ చేశాడు. ఫోన్‌లో మాట్లాడుతూ.. నీటిలో పెట్ట‌వ‌ల‌సిన వాటర్ హీటర్ రాడ్ ను త‌న చంక‌లో పెట్టాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద‌కు ప‌డిపోయారు. అస్వ‌స్థ‌త‌కు గురైన మ‌హేశ్ బాబును భార్య దుర్గాదేవి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement