Tuesday, October 22, 2024

ADB | రైలు ఢీకొని వ్య‌క్తి మృతి..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, తాంసి (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండ‌లంలో హాస‌నపూర్ శివారులో రైలు ఢీకొని పొన్నారి గ్రామానికి చెందిన గుమ్మ‌ల దేవ‌న్న (38) మృతిచెందాడు. రైలు ప‌ట్టాల‌పై మృతదేహం ఉంద‌ని గ్రామ‌స్థులు చూసి రైల్వే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

దీంతో సంఘ‌ట‌న స్థ‌లానికి రైల్వే పోలీసులు చేరుకుని కేసు న‌మోదు చేశారు. ఆయ‌న మృతి చెంద‌డానికి కార‌ణాల‌ను తెలుసుకుంటున్నారు. ప్ర‌మాద‌వశాత్తు జ‌రిగిందా ? ఆత్మహ‌త్య చేసుకున్నారా ? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement