Friday, September 13, 2024

WGL: చెరువులో పడి పశువుల కాపరి మృతి..

కాటారం, సెప్టెంబర్ 5(ప్రభ న్యూస్) : జయశంకర్ జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలో చెరువులో పడి ప‌శువుల‌ కాపరి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ప్రతాపగిరి గ్రామానికి చెందిన మనుబోతుల రాజు (25) అనే వ్యక్తి గురువారం గ్రామ సమీపంలోని చెరువులో పడి మృతిచెందారు.

రోజు మాదిరిగానే ప‌శువుల‌ను కాసేందుకు వెళ్లిన రాజు చెరువులోకి ఒక గేదె వెళ్లడంతో దానిని బయటకు తీసుకొచ్చేందుకు పోయి చెరువులో పడి మృతి చెందినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement