Thursday, September 19, 2024

HYD: హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు

రాజధాని నగరమైన హైదరాబాద్ లో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల కూల్చివేతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. హైడ్రా పేరుతో ఈ కూల్చివేతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఆదివారం మాదాపూర్ లోని సున్నంచెరువులోని అక్రమ కట్టడాల కూల్చివేతను హైడ్రా చేపట్టింది.

అయితే ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. పలువురు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో తమ విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై హైడ్రా సిబ్బంది మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకటేశ్, లక్ష్మీ, సురేశ్ అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement