Tuesday, September 17, 2024

ADB: లారీని ఢీకొట్టిన కారు.. మ‌హిళ మృతి..

నేరడిగొండ, ఆగస్టు 30 (ప్రభ న్యూస్) : మండలంలోని కొరటికల్ గ్రామానికి వెళ్లే జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిరికొండ మండల కేంద్రానికి చెందిన కుటుంబ సభ్యులు జగిత్యాల నుండి సిరికొండ మండలానికి వస్తున్న క్రమంలో మండల కేంద్రంలోని కొరటికల్ గ్రామ సమీపంలోనిజాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న మహిళకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement