Friday, September 6, 2024

TS: బస్సు, లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం…

సుల్తానాబాద్, మే 28 (ప్రభ న్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపాన ఇవాళ‌ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుల్తానాబాద్ బస్టాండ్ నుండి బయటకు వెళుతున్న క్రమంలో కరీంనగర్ వైపు నుండి పెద్దపల్లి వైపు వెళుతున్న టిప్పర్ బస్సు ను ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒకేసారి బెంబేలెత్తి పోయారు.

లారీ బస్సు ఒకదానిని ఒకటి గట్టిగా ఢీకొనడంతో బస్సు, లారీలు కొంత మేర నుజ్జు నుజ్జయిపోయాయి. రోడ్డుపై ప్రమాదం జరగడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్ లు సంఘటన స్థలానికి చేరుకొని ఢీకొన్న లారీ, బస్సులను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మరో బస్సులో తమ గమ్యస్థానాలకు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement