Monday, September 16, 2024

Sangareddy: 83.4 కిలోల గంజాయి స్వాధీనం..

సంగారెడ్డి జిల్లా భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కంకోల్‌ చెక్‌పోస్టు వద్ద 83.4 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ గంజాయి విలువ రూ.33.50 లక్షలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు.

ఇవాళ తెల్లవారుజామున చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ కారులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించగా.. సీట్ల కిందిభాగంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక పెట్టెలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement