Saturday, September 21, 2024

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం… నలుగురికి తీవ్ర గాయాలు

కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలం జనగామ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి…బైక్‌, సైకిళ్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement