Friday, September 20, 2024

2022 – 23 – తెలంగాణలో ఆదాయం 25 శాతం పెరిగింది.. కాగ్ వెల్లడి

రాబడి ఒక శాతం తగ్గింది..
సాగునీటి ప్రాజెక్ట్ అంచనాలు గణనీయంగా పెరిగాయి
ఏకంగా 20 ప్రాజెక్టుల‌లో ఈ తేడా ఉంది
రాష్ట్రాభివృద్ధి రుణాలు, వడ్డీపై ఖర్చు త‌క్కువుగా చూపింది
తెలంగాణ‌పై 22-23 ఆర్ధిక సంవ‌త్స‌రంపై కాగా నివేదిక‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – తెలంగాణ లో 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్‌ నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్‌డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని అందులో పేర్కొంది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని తెలిపింది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది.

- Advertisement -

రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని వెల్లడించింది. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు 150 శాతం మేర పెరిగినట్లు పేర్కొంది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా వేసింది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించిందని వెల్లడించింది. రాష్ట్రాభివృద్ధి రుణాలు, వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది.

సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది. రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారు. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు 150 శాతం మేర పెరిగాయి. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్‌ కంపెనీలకు బకాయిలు రాలేదు. ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్‌పామ్‌ పథకాల నిధులు ఖర్చు కాలేదు. దళితబంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదు” అని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement