Saturday, September 7, 2024

Telangana – డిఎస్సీ పై హైకోర్టులో విచార‌ణ వాయిదా ..

ఆంధ్ర‌ప‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ప్ర‌స్తుతం జ‌రుగుతున్న డీఎస్సీ పరీక్ష ల‌ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ 28కి వాయిదా పడింది. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పది మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన‌ న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు. నోటిఫికేషన్ కు పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ఇచ్చారని, ఈ నాలుగు నెలల వ్యవధిలో ఇతర అనేక పరీక్షలు రాశారన్నారు. సమయాభావం వల్ల పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారని తెలిపారు.

ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పది మంది కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు డీఎస్సీకి తగిన సమయం ఉందన్నారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారని కోర్టుకు వివరించారు. పిటిషన్ వేసిన పది మంది డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేశారా అని కోర్టు ప్రశ్నించింది. గ్రూప్ -1 తో పాటు డీఏవో, డీఎస్సీకి అప్లై చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాది వెళ్లడించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement