దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రసంగించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఆ విషయాలను జెలెన్ తెలిపారు. డాన్ బాస్ లో పరిస్థితులు దారుణంగా మారాయని, చాలా మంది చనిపోతున్నారని ఆయన అన్నారు. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాతో చర్చలు జరపడం క్లిష్టంగా తయారైందన్నారు. రష్యా ఫెడరేషన్ అధికారులు, ఉక్రెయిన్ అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావట్లేదని అన్నారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని మండిపడ్డారు. యుద్ధం చేయిస్తోంది పుతినే కాబట్టి ఆయనతో నేరుగా చర్చించకుండా ఈ యుద్ధాన్ని ముగించలేమన్నారు. రష్యా దళాలు జరిపిన యుద్ధ నేరాల గురించి చర్చలు జరిపేందుకు రష్యా విముఖత చూపించిందని ఆయన అన్నారు. దీంతో ఇక పుతిన్ తో తప్ప, ఏ రష్యా అధికారితోనూ సమావేశం కాబోమని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement