ఐరోపా దేశాలకు ఉక్రెయిన్ పౌరులు వలస వెళ్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది ఐరోపాకు వలస వెళ్లారు. ఐరోపాకు వలస వెళ్లిన వారిలో మహిళలు, చిన్నారులు వున్నారు. మరోవైపు.. ఉక్రెయిన్పై .. రష్యా బలగాలు ..విరుచుకుపడుతున్నాయి. జనావాసాలపై మిస్సైల్ దాడులు చేస్తున్నాయి. ఓ వైపు యుద్ధ ట్యాంకులు, మరోవైపు వైమానిక దాడులతో ఉక్రెయిన్ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో విధ్వంసం సృష్టించింది రష్యా. అపార్ట్మెంట్లు , షాపింగ్ మాల్స్, మార్కెట్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement