Saturday, September 7, 2024

TSPSC కేసులో మ‌రో ఇద్ద‌రు అరెస్ట్..

టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన కేసులో మరో ఇద్దరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గి భగవంత్ కుమార్, కోస్గి రవికుమార్‌లను శుక్రవారం అరెస్టు చేశారు. భగవంత కుమార్ తన తమ్ముడు కోస్గి రవికుమార్ కోసం పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు.

దర్యాప్తు అధికారులు ఢాకా నాయక్ బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గి భగవంత్ కుమార్ విషయం బయటకు వచ్చింది. కోస్గి భగవంత్ కుమార్ వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పని చేస్తూ దొరికిపోయాడు. రెండు లక్షలకు ఢాకా నాయక్‌ నుంచి ఏఈ పేపర్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement